Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క మగాడు మినహా.. ఆ గ్రామం మొత్తాన్ని కోవిడ్ సోకింది..?

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (22:04 IST)
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. తాజాగా ఒక గ్రామం మొత్తం కోవిడ్ వ్యాపించింది. ఆ గ్రామం హిమాచల్ ప్రదేశ్‌లో వుంది. ఒకే ఒక్కరు మినహా ఆ గ్రామంలోని ప్రజలందరు కరోనా వైరస్ బారినపడ్డారని అధికారులు అంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. హిమాచల్ ప్రదేశ్‌లోని లాహాల్ లోయలోని థొరాంగ్ గ్రామంలోని ప్రజలకు కరోనాతో ఈ క్లిష్ట పరిస్థితి ఎదురైంది. 42మంది ఉన్న ఆ గ్రామంలో 52ఏళ్ల భూషణ్ ఠాకూర్ మినహా మిగిలిన వారంతా ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఈ గ్రామం మనాలి-కెలాంగ్‌ జాతీయ రహదారికి సమీపంలో ఉంది.
 
దీనిపై భూషణ్ మాట్లాడుతూ.. నాలుగు రోజుల పాటు తాను వండుకుని తింటున్నానని చెప్పాడు. తన కుటుంబ సభ్యులు వేరే గదిలో ఉంటున్నారు. ఫలితాలు వచ్చే వరకు తన కుటుంబంతోనే ఉన్నాను. కానీ, కొవిడ్ నిబంధనలను కఠినంగా పాటించాను. ఈ వ్యాధిని ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. శీతాకాలం కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భూషణ్ మీడియాకు వెల్లడించారు. 
 
కాగా, కొద్ది రోజుల క్రితం ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడం వల్లే ఆ గ్రామస్థులందరూ వైరస్ బారిన పడ్డారని ఆధికారులు ఆరోపిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని లాహాల్‌-స్పితి లోయలోని ప్రజలు కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఈ జిల్లాలో 30 వేల మంది జనాభా ఉండగా..ఇప్పటివరకు 856 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments