Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం మూసివేత-22 మంది ఉద్యోగులకు కరోనా

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (11:00 IST)
కేరళలో ఒకేరోజు 4,698 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 59,438కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,07,119 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో కేరళలోని సుప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని రెండు వారాలపాటు మూసివేయనున్నారు. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో పనిచేస్తున్న 22మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 
 
దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆలయాన్ని మూసివేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెండు వారాలపాటు భక్తులను దర్శనాలకు అనుమతించడం లేదని ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక.. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ భక్తులకు ఆలయంలో ప్రవేశాలు కల్పించారు.
 
శబరిమల తీర్థయాత్రలు ప్రారంభమైన నేపథ్యంలో గురువాయూర్ దేవాలయంలో ఆన్‌లైన్ బుకింగ్ కూడా ప్రారంభించారు. భక్తులకు ప్రవేశం లేకుండా గురువాయూర్ ఆలయాన్ని మూసివేసినప్పటికీ పూజారులు మాత్రం ఆలయంలో క్రమం తప్పకుండా ఏకాంతంగా పూజాదికాలు కొనసాగిస్తారని ఆలయ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments