Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలిఫోర్నియాలో గొరిల్లాలను సైతం వదలని కరోనావైరస్, మూడింటిలో లక్షణాలు

Webdunia
మంగళవారం, 12 జనవరి 2021 (18:39 IST)
కోవిడ్ 19 ఇపుడు జంతువులపైనా దాడి చేస్తోంది. కాలిఫోర్నియాలో కోవిడ్ -19 విధ్వంసం సృష్టిస్తోంది. మనుషులే కాదు ఇపుడు కోవిడ్ బాధిత జాబితాలో గొరిల్లాలు కూడా చేరాయి. శాన్ డియాగో జంతుప్రదర్శనశాలలో కనీసం రెండు గొరిల్లాలు కోవిడ్ -19 బారిన పడిన తరువాత మరో మూడింటిలో వైరస్ లక్షణాలు వున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
గొరిల్లాలలో కరోనావైరస్ ఇదే మొదటిసారి అని జూ సిబ్బంది తెలిపారు. గత బుధవారం రెండు జూ గొరిల్లాల్లో దగ్గు ప్రారంభమైంది. ప్రాథమిక పరీక్షలో శుక్రవారం నాడు వాటికి వైరస్ ఉన్నట్లు తేలింది. యుఎస్ వ్యవసాయ శాఖ నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ లాబొరేటరీ సోమవారం వాటికి పాజిటివ్ అని నిర్ధారించింది.
 
ఐతే కరోనావైరస్ గొరిల్లాల ప్రాణాలను హరించే శక్తి వుందో లేదో తెలియదంటున్నారు జూ యాజమాన్యం. ప్రస్తుతం వాటిని నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు. కాగా గత డిసెంబరు నెల నుంచి జూని మూసివేసారు. మరోవైపు కాలిఫోర్నియా కోవిడ్ -19 కేంద్రంగా మారింది. సోమవారం ఐసియులో 4,971 మంది రోగులు ఉన్నారు. దేశవ్యాప్తంగా వారాంతంలో వైరస్ ఉన్న మొత్తం అమెరికన్ల సంఖ్య 22 మిలియన్లను అధిగమించిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాల తెలియజేస్తున్నాయి. మరోవైపు ఇప్పటివరకూ 3,75,000 మందికి పైగా మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments