మహారాష్ట్ర మాజీ సీఎంకు కరోనా... 50 వేలు దాటిన పాజిటివ్ కేసు

Webdunia
సోమవారం, 25 మే 2020 (08:50 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తిశరవేగంగా ఉంది. ఫలితంగా ఈ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు మించిపోయాయి. అదేసమయంలో ఈ రాష్ట్రంలోని పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ సీఎంలు కూడా ఈ వైరస్ బారినపడుతున్నారు. తాజాగా ఆ రాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్‌కు కరోనా వైరస్ సోకింది. కాంగ్రెస్ నేత అయిన ఈయన ప్రస్తుత మంత్రివర్గంలో ప్రజా పనుల శాఖామంత్రిగా ఉన్నారు. 
 
ఈయన తరచూ ముంబై నుంచి తన స్వగ్రామమైన మరఠ్వాడాకు వెళ్లి వస్తుంటారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు వైరస్ సంక్రమించి ఉంటుందని అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆయనకు వైరస్ సోకిందని, ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారని ఓ అధికారి తెలిపారు. 
 
మరోవైపు, ఎన్సీపీ నేత, గృహ నిర్మాణ మంత్రి అయిన జితేంద్ర అవద్ కూడా కరోనా బారినపడ్డారు. రెండు వారాలపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత ఆయన కోలుకున్నారు.
 
ఇదిలావుంటే, మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటిపోయింది. ఆదివారం ఒక్క రోజే ఏకంగా 3,041 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం మహారాష్ట్రలో ఇదే తొలిసారి. 
 
అలాగే, 58 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,635కు చేరింది. తాజాగా మరణించిన వారిలో 39 మంది ముంబైకి చెందినవారు కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

DSP: ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్ ప్రోమో - పవన్ కు గిఫ్ట్ ఇది : దేవీశ్రీ ప్రసాద్

DiL Raju: నిర్మాత అంటే విలువలేదు - కానీ సినిమా తీస్తా : దిల్ రాజు

తండ్రి కూతురు సెంటిమెంట్ తో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్

Sri Vishnu: విష్ణు విన్యాసం స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది : శ్రీ విష్ణు

Anupama: అనుపమ పరమేశ్వరన్ తో అగ్ర నిర్మాణ సంస్థ కొత్త మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

తర్వాతి కథనం
Show comments