Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫరూక్ అబ్దుల్లా కరోనా పాజిటివ్.. దేశంలో 271 మంది మృత్యువాత

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (10:31 IST)
నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ప్రెసిడెంట్‌, జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా ట్విట్టర్‌ ద్వారా ధ్రువీకరించారు. 
 
వైరస్‌కు పాటివ్‌గా పరీక్షించారని, కొన్ని లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇతర కుటుంబీకులతో కలిసి క్వారంటైన్‌లో తాను సైతం సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంటానని తెలిపారు. ఇటీవల తమను కలిసిన వారంతా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
 
మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 56,211 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,20,95,855కు పెరిగింది. 
 
వైరస్‌ ప్రభావంతో 24 గంటల్లో 271 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,62,114కు చేరింది. తాజాగా 27,028 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,13,93,021 మంది కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments