వేడి నీళ్ళతో స్నానం చేస్తే కరోనా వైరస్ చనిపోతుందా? (video)

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (16:17 IST)
భారత్‌తో పాటు.. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ కరోనా వైరస్. ఈ వైరస్ ధాటికి అనేక మంది పిట్టల్లా రాలిపోతున్నారు. లక్షలాది మంది ఈ వైరస్ బారిపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరు ఈ వైరస్ బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటే.. ఈ వైరస్ బారినపడినవారు త్వరగా కోలుకునేందుకు తమకు తోచిన పద్ధతులను అవలంభిస్తున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నుంచి రక్షణ పొందే సలహాలు, సూచనలే తీసుకోవాలి. అపోహలు, అయోమయానికి గురిచేసే వార్తలకు దూరంగా ఉండాలి. 
 
ముఖ్యంగా, చాలా మందికి ఎండలో నిలబడినా, లేక వేడినీళ్ళతో స్నానం చేసినా ఈ వైరస్ చనిపోతుందన్న అపోహతో పాటు.. బాహ్యప్రపంచంలో ప్రచారం ఎక్కువగానే జరుగుతుంది. దీనిపై వైద్యులను సంప్రదిస్తే, నీళ్ళు బాగా తాగడం వల్ల కరోనా వైరస్‌ ఒంట్లో నుంచి పోతుందని అనుకోవడం అపోహే. అలాగే, ఐస్‌ క్రీములు తిన్నంత మాత్రాన వైరస్‌ స్తంభించిపోతుందని అనుకోవడమూ తప్పే!
 
అలాగే, వేడి నీళ్లతో స్నానం చేసినా, అలాగే హ్యాండ్‌ డ్రయ్యర్లు వాడినా వైరస్‌ చనిపోతుందని అనుకోవడం పొరపాటు. అలాగే, ఎండలో నిలబడినంత మాత్రాన వైరస్‌ పోదు. ఒంటి మీద ఆల్కహాల్‌ స్ర్పే చేసుకున్నా, లేదంటే ఆల్కహాల్‌ తాగినా వైరస్‌ చనిపోతుందనుకోవడం అపోహ. ఫ్లూ టీకాలు వేసుకుంటే కొవిడ్‌ 19 వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుందనే ప్రచారం అర్థరహితమే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments