Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కులు ధరించడం వల్ల రోగనిరోధకశక్తి బలహీనపడుతుందా?

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (13:08 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు వీలుగా విధిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని వైద్య నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. దీంతో అనేక మంది ఇంట్లో నుంచి కాలుబయటపెడితే ముఖానికి మాస్క్ ధరిస్తున్నారు. అయితే, ఈ మాస్కులు ధరించడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి తగ్గుతుందని ఇంగ్లండ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ (ఆర్ఎస్‌జీపీ) నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. 
 
ముఖ్యంగా చిన్నారుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనం తేల్చింది. ఈ మార్గదర్శకాలను పాటించడం వల్ల కోవిడ్ మాత్రమే కాకుండా ఫ్లూ వంటి ఇతర శ్వాస సంబంధిత సమస్యల నుంచి కూడా తప్పించుకోవడం సాధ్యమైందని తెలిపింది. 
 
ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలు ఏమిటంటే, మాస్క్ ధారణ, భౌతిక దూరం పాటించడానికి సంబంధించిన ఆంక్షలను ఉపసంహరించిన తర్వాత సాధారణ సూక్ష్మ జీవుల నుంచి తప్పించుకునే సామర్థ్యం బాలలకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 
 
దీనికి కారణం కోవిడ్-19 మార్గదర్శకాల అమలుకాలంలో బాలల్లో రోగ నిరోధక శక్తి బలహీనపడటమేనని చెప్తున్నారు. ఈ ఆంక్షల అమలు కాలంలో బాలలు మాస్క్‌లు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ సూక్ష్మ జీవుల నిరోధక సామర్థ్యాన్ని పెంచుకోలేకపోయినట్టు తేలిందని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments