Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కోవిడ్ టీకా తీసుకున్న రతన్ టాటా

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (12:49 IST)
టాటా గ్రూపు సంస్థల అధినేత రతన్ టాటా ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. తొలి డోసు టీకా వేయించుకున్నట్లు ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో వెల్లడించారు. టీకాను చాలా సులువుగా, నొప్పి లేకుండా తీసుకున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. 
 
కరోనా నుంచి అందరూ సురక్షితంగా ఉంటారని భావిస్తున్నట్లు రతన్ టాటా తన ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2.82 కోట్ల మంది కోవిడ్ టీకా తీసుకున్నారు. నిన్న ఒక్క రోజే 20 లక్షల 53 వేల మంది కోవిడ్ టీకా వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
 
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే గడిచిన వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే మొత్తం కేసుల సంఖ్య 1.09కోట్లకుపైగా చేరగా.. యాక్టివ్‌ కేసుల సంఖ్య రెండులక్షలపైగా చేరుకుంది. 
 
తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 24,882 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,13,33,728కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments