Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కోవిడ్ టీకా తీసుకున్న రతన్ టాటా

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (12:49 IST)
టాటా గ్రూపు సంస్థల అధినేత రతన్ టాటా ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. తొలి డోసు టీకా వేయించుకున్నట్లు ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో వెల్లడించారు. టీకాను చాలా సులువుగా, నొప్పి లేకుండా తీసుకున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. 
 
కరోనా నుంచి అందరూ సురక్షితంగా ఉంటారని భావిస్తున్నట్లు రతన్ టాటా తన ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2.82 కోట్ల మంది కోవిడ్ టీకా తీసుకున్నారు. నిన్న ఒక్క రోజే 20 లక్షల 53 వేల మంది కోవిడ్ టీకా వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
 
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే గడిచిన వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే మొత్తం కేసుల సంఖ్య 1.09కోట్లకుపైగా చేరగా.. యాక్టివ్‌ కేసుల సంఖ్య రెండులక్షలపైగా చేరుకుంది. 
 
తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 24,882 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,13,33,728కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments