ఢిల్లీలో మొదలైన కమ్యూనిటీ స్ప్రెడ్ : ఆరోగ్య శాఖామంత్రి జైన్

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (16:30 IST)
దేశ రాజధాని ఢిల్లీ మరోమారు కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుంది. రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనిపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యేందర్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో సమూహ వ్యాప్తి (కమ్యూనిటీ స్ప్రెడ్) ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ కూడా క్రమంగా జనాల్లోకి వెళ్లిపోయి వ్యాప్తి మొదలైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఢిల్లీలో కొత్తగా నమోదైన 46 శాతం కేసుల్లో ఒమిక్రాన్ కేసులేనని ఆయన గుర్తుచేశారు. అందుకే ఢిల్లీలో జన్యుక్రమ విశ్లేషణ మొదలుపెట్టినట్టు చెప్పారు. కాగా, గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో ఏకంగా 923 కరోనా కేసులు నమోదయ్యాయి. గత మే 30వ తేదీ నుంచి నమోదైన రోజువారీ కరోనా కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పంజుర్లి' హావభావాలు ప్రదర్శించి చిక్కుల్లో పడిన 'ధురంధర్' హీరో

Hrithik Roshan: ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కోసం హృతిక్ రోషన్, ర్యాన్ గాస్లింగ్ ప్రత్యేక సంభాషణ

Anandhi: గరివిడి లక్ష్మి లో కోసింది కొయగూర సాంగ్ లో ఆకట్టుకున్న ఆనంది

Kona Venkat: బ్యాండ్ మేళం నచ్చకపోతే ఇంకో సారి నా సినిమాని చూడకండి.: కోన వెంకట్

Atlee: అల్లు అర్జున్ AA22 సైన్ ఫిక్షన్ చిత్రం అప్ డేట్ తో అట్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెన్ను నొప్పి పారదోలే చిట్కాలు

వన్‌చెఫ్‌ను విడుదల చేసిన ఫిలిప్స్

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

తర్వాతి కథనం
Show comments