కరోనా సెకండ్ వేవ్.. చలికాలం వచ్చేస్తోంది.. జాగ్రత్త..!

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (13:30 IST)
దేశంలో కరోనా కేసులు 80 లక్షలు దాటేశాయి. సగం మందికి అనధికారికంగా వచ్చిపోయిందని కొందరంటున్నారు. ఏది ఏమైనా డిసెంబర్‌ నాటికి కరోనా తగ్గుముఖం పడుతుందని సర్కారీ గణాంకాలు చెబుతున్నాయి. మరణాల రేటు కూడా తగ్గుతోంది. అయినా ప్రజల నిర్లక్ష్యం కారణంగా వ్యవహరిస్తున్నారు.  నవంబర్‌ 30 వరకు నిబంధనలున్నా జనం సామాన్యజీవనానికి వచ్చేస్తున్నారు. ఉద్యోగాలు, ఉపాధి ఇతర అవసరాల కోసం పరిమితులు దాటిపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో చలికాలం వచ్చేసింది. వైరస్, బ్యాక్టీరియాలు పంజా విసరడానికి.. ఇది ఎంతో అనుకూలమైన కాలం. ఈ ఏడాది కరోనాతో పాటు మరెన్నో సీజనల్ రోగాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏటా ఈ సమయంలో డెంగీ, మలేరియా, స్వైన్ ఫ్లూ తదితరల సీజనల్ వ్యాధులు విపరీతంగా అటాక్ చేస్తాయి. గతంతో పోలీస్తే ఈసారి సీజనల్ వ్యాధులు కాస్త తక్కువగానే నమోదవుతున్నా.. ఈ సమయంలో కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు. 
 
ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తుంది.. అలా అని కరోనా పీడ విరగడైందనే భ్రమ మాత్రం వద్దంటున్నారు డాక్టర్లు. ఇప్పటికే అమెరికా, ఐరోపా దేశాల్లో సెకండ్ వేవ్ వణికిస్తోంది. కేరళలో తగ్గిన కరోనా కేసులు.. ఓనం పండుగ తర్వాత పెరిగిపోయాయి. అందుకే మొదటి సారి వైరస్ నియంత్రణ కోసం తీసుకున్న జాగ్రత్తలు.. ఇపుడు కచ్చితంగా కొనసాగించాలంటున్నారు వైద్యులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments