Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (17:15 IST)
కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈయనకు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్టు పేర్కొన్నారు. 
 
"తేలికపాటి లక్షణాలు కనిపించగా ఈ రోజు పరీక్షలు చేయించుకున్నాను. ఈ పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ అని తేలింది" అని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు వెల్లడించారు. అలాగే, ఇటీవల తనతో కాంటాక్ట్ అయినవారంతా పరీక్షలు చేయించుకుని జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. 
 
ఇదిలావుంటే గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,79,723కి పెరిగింది. కోరనా వల్ల ఒక్క రోజు వ్యవధిలో 146 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, 46569 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. తాజాగా కేసులతో కలుపుకుంటే కరోనా పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments