కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (17:15 IST)
కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈయనకు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్టు పేర్కొన్నారు. 
 
"తేలికపాటి లక్షణాలు కనిపించగా ఈ రోజు పరీక్షలు చేయించుకున్నాను. ఈ పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ అని తేలింది" అని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు వెల్లడించారు. అలాగే, ఇటీవల తనతో కాంటాక్ట్ అయినవారంతా పరీక్షలు చేయించుకుని జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. 
 
ఇదిలావుంటే గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,79,723కి పెరిగింది. కోరనా వల్ల ఒక్క రోజు వ్యవధిలో 146 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, 46569 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. తాజాగా కేసులతో కలుపుకుంటే కరోనా పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments