గినియాలో మరో భయంకరమైన వైరస్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (13:03 IST)
ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచం వణికిపోతోంది. పైగా, ఈ వైరస్ జన్యుపరంగా పలు రకాలుగా రూపాంతరం చెందుతుంది. తాజాగా మరో భయంకరమైన వైరస్‌ను గుర్తించారు. దీనికి మార్ బుర్గ్ అనే పేరు పెట్టారు. ఇది ఆఫ్రికాలోని గినియా దేశంలో వెలుగు చూసింది. ఈ విషయన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 
 
ఈ ప్రాణాంతక వైరస్ చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. గబ్బిలాల నుండి ప్రజలకు వ్యాపించే ఈ వైరస్ కారణంగా జ్వరం తీవ్ర తలనొప్పితో పాటు రక్తస్రావం అవుతోందని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో 24 శాతం నుంచి 88 శాతం వరకు చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 
 
ఈ నేపథ్యంలో ప్రారంభంలోనే ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ వైరస్ పై పరిశోధనల‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందాన్ని పశ్చిమ ఆఫ్రికాకు పంపించినట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారి కారణంగా ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతో మంది ప్రజలు కరోనా బారిన పడి మృతి చెందారు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో డెల్టా వైర‌స్ కలకలం రేపుతోంది. క‌రోనా బారిన ప‌డి చాలామంది ప్ర‌జ‌లు ఆస్ప‌త్రుల్లో చేరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments