Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రిసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ప్రమాదకర పరిస్థితులు... ఆందోళనలో స్థానికులు

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (13:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ కేసుల భయంతో తిరుపతి, శ్రీకాళహస్తి వంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. 
 
ముఖ్యంగా తిరుపతి విషయానికి వస్తే నగరంలో 12, రూరల్‌ మండలంలో 2 చొప్పున 14 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ తిరుపతి నగరంలో 146, రూరల్‌లో 37 చొప్పున మొత్తం 183 కేసులు వెలుగు చూశాయి. 
 
అలాగే, శ్రీకాళహస్తిలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 130కి చేరుకుంది. తిరుపతి, శ్రీకాళహస్తిలలో నమోదైన కేసులు ఆయా పట్టణాల స్థాయి దృష్ట్యా రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా అత్యధికంగానే పరిగణించాలి. 
 
తాజాగా, జిల్లాలో 32 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తిరుపతిలో 12, రూరల్‌లో 2, పుత్తూరులో 6, చిత్తూరు, నగరిలో నాలుగు చొప్పున, రేణిగుంట, శ్రీకాళహస్తిలలో రెండు చొప్పున కేసులున్నాయి. 
 
పుత్తూరులో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలతో పాటు వారి 17, 15 ఏళ్ల కుమారులిద్దరికీ వైరస్‌ సోకింది. శ్రీకాళహస్తిలో ఇద్దరు రిమాండు ఖైదీలకు పాజిటివ్‌ తేలింది. దీంతో జైలుకు పంపాల్సిన వారిని తిరుపతి కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments