ఆంధ్రాలో 12 వేల కరోనా కేసులు - 12 మంది మృతి

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (19:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,561 మందికి ఈ వైరస్ సోకింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40,635 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా ఈ కేసులు బయటపడ్డాయి. ఈ వైరస్ సోకి 12 మంది చనిపోయారు. 
 
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1,710 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గుంటూరులో 1,625, కడపలో 1,215, విశాఖపట్టణంలో 1,211 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
అదేవిధంగా మృతుల్లో విశాఖలో మూడు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఇద్దరేసి, అనంతపురం, చిత్తూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఒక్కరేసి చొప్పున కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ 12 మంది మృతులతో కలుపుకుంటే ఏపీలో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 14,591కు చేరింది. అలాగే, ఇప్పటివరకు మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల  సంఖ్య 22,48,608కి చేరగా 21,20,717 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో 1,13,300 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్

మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం

375 కోట్లకు పైగా వసూలు చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు

యుఫోరియా చూసిన తరువాత రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను : భూమిక

జియో స్టార్‌లో ప్ర‌భాస్ .. ది రాజా సాబ్ ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

తర్వాతి కథనం
Show comments