Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఆరు నెలల తర్వాత అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (13:22 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. గత ఆరు నెలల తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో 3824 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. 
 
దాదాపు 184 రోజుల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు, కేరళ రాష్ట్రంలో రెండు మృతి కేసులు నమోదయ్యాయి. ఈ మరణాలతో కలిపి ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయిన వారి  సంఖ్య 5,30,389కి చేరింది. అలాగే, దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 18,389కి చేరింది. 
 
రోజువారీ పాజిటివిటీ రేటు 2.87 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.24 శాతంగా ఉంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 4,47,22,605 మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో 4,41,73,335 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.77 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

Avika Gor: ప్రియుడు మిలింద్ చంద్వానీతో అవికా గోర్ నిశ్చితార్థం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments