శ్రీహరికోట షార్ కేంద్రంలో కరోనా కలకలం : 12 మంది ఉద్యోగులకు పాజిటివ్

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (10:55 IST)
శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. ఏకంగా 12 మంది ఉద్యోగులతో పాటు ఇద్దరు వైద్యులకు ఈ వైరస్ సోకినట్టు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో వెల్లడైంది. వీరందరి శాంపిల్స్‌ను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం బెంగుళూరులోని పరిశోధనాశాలకు పంపించారు. 
 
ఒకేసారి ఏకంగా 14 మందికి కరోనా సోకడంతో అంతరిక్ష కేంద్రంలో పని చేస్తున్న మిగిలిన ఉద్యోగులకు కూడా కోవిడ్ పరీక్షలను వైద్య శాఖ నిర్వహిస్తుంది. అలాగే, స్పేస్ సెంటరులో కరోనా వైరస్ కలకలం చెలరేగడంతో ప్రత్యేక మార్గదర్శకాలను కూడా షార్ అధికారులు జారీచేశారు. 
 
బయోమెట్రిక్ అటెండెన్స్ స్థానంలో హాజరుపట్టీలను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, వైద్యులకు ఈ వైరస్ సోకడంతో ఈ నెలాఖరులో నిర్వహించతలపెట్టిన రీశాట్ శాటిలైట్ ప్రయోగాన్ని వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sprit legal notice: మహిళా రైతు నిర్మాత నర్సమ్మ స్పిరిట్ చిత్రానికి ప్రభాస్ కు సంబంధం ఏమిటి?

Narne Nithin: నార్నే నితిన్ #NN5 మూవీ హ్యూమరస్ క్రియేటివ్ పోస్టర్ ద్వారా అనౌన్స్‌మెంట్

Naga Durga : ప్రియదర్శి మూవీలో హీరోయిన్ గా తెలుగు ఫోక్ సాంగ్స్ ఫేమ్ నాగదుర్గ

Suriya: విశ్వనాథ్ & సన్స్ చిత్రం తొలి గీతం నేనో బటర్‌ఫ్లై

Prabhas: మాటలు లాంటి పాటలతో తీశాం గట్టిగా చెప్పు అంటున్న ప్రభాస్

తర్వాతి కథనం
Show comments