Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి - చిత్తూరులో 1,534 కేసులు

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (18:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పతాక స్థాయికి చేరిందని చెప్పాలి. గత 24 గంటల్లో ఏకంగా 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఒక్క చిత్తూరు జిల్లాలోనే 1,534 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. 
 
ఇందులో గడిచిన 24 గంటల్లో 38,055 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా, ఇందులో 6,996 మందికి కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఏకంగా 1,534 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో విశాఖపట్టణం 1,263 కేసులు, గుంటూరులో 758, శ్రీకాకుళంలో 573 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఇదిలావుంటే, గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ సోకడం వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 1,066 మంది కోలుకున్నారు. దీంతో కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,514కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,17,384 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20,66,762 మంది ఈ వైరస్ నుంచి విముక్తులయ్యారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments