Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకో రికార్డు.. భారత్‌‌లో పెరిగిపోతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో 90వేలు

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (11:57 IST)
భారత్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇంకా రోజుకో రికార్డును సృష్టిస్తున్నాయి. ఆదివారం నమోదైన వివరాల ప్రకారం 24 గంటల్లో దేశవ్యాప్తంగా 90,802 మంది కొత్తగా వ్యాధిబారిన పడ్డారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కేవలం ఒక్కరోజులోనే ఏ దేశంలోనూ ఈ స్థాయిలో నిర్ధారణ జరగలేదు. దీంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. 7,20,362 శాంపిళ్లను పరీక్షిస్తేనే ఇలాంటి ఫలితాలు రావడం గమనార్హం.
 
ఆదివారం 1,016 మంది వైరస్ కారణంగా మరణించారు. 69,564 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,04,614గా ఉంది. 71,642 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 32,50,429 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
 
ఇంకా 8,82,542 మంది చికిత్స తీసుకుంటూ ఉన్నారు. బాధితుల రికవరీ రేటు 77.31 శాతంగా ఉందని ప్రకటించారు. 4,95,51,507 మందికి పరీక్షలు నిర్వహించారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 27,292,585 మందికి వ్యాధి సోకింది. వీరిలో 887,554 మంది మృత్యువాతపడ్డారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments