Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. ముగ్గురు మృతి

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (10:37 IST)
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తాజాగా కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 952 కరోనా పాజిటివ్‌ కేసులున్నాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తంగా తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు 2.58 లక్షలకు చేరుకున్నాయి. 
 
గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ముగ్గురు మృతి చెందారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనాతో 1,410 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,732 యాక్టివ్‌ కేసులుండగా.. 2.43లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 38,245 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 50 లక్షలకు చేరువైంది. ప్రస్తుతం ఈ సంఖ్య 49,29,974కు చేరుకుంది. ప్రతి 10 లక్షల మంది జనాభాకూ 1,32,454 టెస్టులను నిర్వహించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments