Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు ఓ పారాసిట్మల్ టాబ్లెట్ చాలు.. పానిక్ బటన్ నొక్కాల్సిన పనిలేదు.. జగన్

Webdunia
ఆదివారం, 15 మార్చి 2020 (16:42 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు వైద్య నిపుణులో మందు కనుగొనలేకపోయారు. కానీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓ మందు కనిపెట్టారు. కరోనా వైరస్‌కు ఓ పారాసిట్మల్ మాత్ర సరిపోతుందని సెలవిచ్చారు. అంతేకానీ, కరోనా వైరస్ వల్ల మనుషులు చనిపోతారనీ, ఇదొక భయానక పరిస్థితి అని పానిక్ బటన్ నొక్కాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
 
ఆయన ఆదివారం రాష్ట్ర గవర్నర్ హరిచందన్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రెస్ మీట్ నిర్వహించాల్సి రావడం దురదృష్టకరమన్నారు. వృద్ధులు, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు, ఇతర వ్యాధులు ఉన్న వారిపై కరోనా వైరస్ ప్రభావం చూపుతుందన్నారు. ఇతరత్ర ఆరోగ్య సమస్యలు లేనివారు భయపడాల్సిన అవసరం లేదన్నారు. 
 
ముఖ్యంగా, కరోనా వైరస్ పై కొన్ని విషయాలు అవగాహన చేసుకోవాలని, ఈ వైరస్ వల్ల మనుషులు చనిపోతారని, ఇదొక భయానక పరిస్థితి అని 'పానిక్ బటన్' నొక్కాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. 'కరోనా' కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కొన్ని కొన్ని జాగ్రత్తలు మనం కూడా పాటించాలని సూచించారు. 
 
రాష్ట్రంలో ఇప్పటివరకు 70 నమూనాలు పరిశీలిస్తే అందులో ఒకరికి మాత్రమే కరోనా పాజిటివ్‌గా వచ్చిందని గుర్తుచేశారు. కరోనా కేసుల్లో 13.8 శాతం మాత్రమే ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నాయని, 85 శాతం కేసులకు ఇంటి దగ్గరే చికిత్స జరుగుతోందని, 4.75 శాతం కేసులు మాత్రమే విషమంగా ఉన్నాయని తెలిపారు. 
 
ఇతర దేశాల్లో ఉన్న భారతీయులను త్వరలోనే ఆయా దేశాలు వారిని స్వదేశానికి పంపిస్తాయని, ఈ పక్రియ కొన్ని నెలలపాటు కొనసాగుతుందని, ఇది రెండు, మూడు వారాల్లో పూర్తయ్యే ప్రక్రియ కాదని అన్నారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు దాదాపు యేడాదిపాటు కొనసాగుతాయని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments