Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా విజృంభణ: 8వేల మందికి పాజిటివ్

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (11:08 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మరోసారి 8 వేలకు పైగా కేసులు రాగా.. ముందురోజు కంటే 33 శాతం అధికంగా నమోదయ్యాయి. క్రియాశీల కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది.  
 
మంగళవారం 4.40 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 8,822 మందికి వైరస్ సోకినట్లు తేలింది. క్రితంరోజు ఆ సంఖ్య 6,594గా ఉంది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 2 శాతానికి చేరింది. 
 
మహారాష్ట్రలో 2,956, కేరళలో 1,986, ఢిల్లీలో 1,118 మందికి కరోనా సోకింది. హర్యానా, కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో వైరస్ విస్తరిస్తోన్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ 4.32 కోట్ల మందికి పైగా మహమ్మారి బారినపడ్డారు.
 
24 గంటల వ్యవధిలో 5,718 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ 98.66 శాతం మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. మంగళవారం 15 మంది మరణించగా.. మొత్తంగా 5.24 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments