Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్తగా 4,038 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (21:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 4,038 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 73,767 శాంపిళ్లను పరీక్షించగా 4,038 మంది కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 5,622 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
చిత్తూరు జిల్లాలో 9, ప్రకాశం 7, కృష్ణా 5, ర్పుగోదావరి4, గుంటూరు3, కడప3, విశాఖపట్నం3, అనంతపురం, కర్నూలు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలలో ఒకరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,71,503కి చేరింది.
 
ఇప్పటి వరకు కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 6,357కి చేరింది. వివిధ ఆస్పత్రులలో చికిత్స పొంది కోలుకొని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7,22,204గా వుంది. ప్రస్తుతం వివిధ కోవిడ్ ఆస్పత్రులలో 40,047 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 68,46,040 మంది నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments