భారత్‌లో కరోనా తగ్గుముఖం,కొత్తగా 49,881 పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (13:46 IST)
కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా కాస్త వెనుకంజ వేస్తోంది. గత కొన్ని నెలలుగా తీవ్ర స్థాయిలో వున్న కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 80 లక్షల 40 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 49,881 కేసులు నమోదు కాగా 517మంది ప్రాణాలు కోల్పోయారు.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 56,480 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం 80,40,203 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,03,687 ఉండగా 73,15,989 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా 1,20,527మంది కరోనా వ్యాధితో మరణించారు.
 
ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 90.99శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసులలో 1.50 శాతానికి మరణాల రేటు తగ్గింది. దేశంలో మొత్తం నమోదైన కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 7.51 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,75,760 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు దేశంలో 10,65,63,440 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

Laya: సాంప్రదాయబద్ధంగా జీవించే శివాజీ, లయ వాటిని బ్రేక్ చేస్తే?

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పై ల‌వ్ సాంగ్

వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? జబ్ ఖులి కితాబ్ ZEE5లో స్ట్రీమింగ్

109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments