Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా తగ్గుముఖం,కొత్తగా 49,881 పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (13:46 IST)
కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా కాస్త వెనుకంజ వేస్తోంది. గత కొన్ని నెలలుగా తీవ్ర స్థాయిలో వున్న కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 80 లక్షల 40 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 49,881 కేసులు నమోదు కాగా 517మంది ప్రాణాలు కోల్పోయారు.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 56,480 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం 80,40,203 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,03,687 ఉండగా 73,15,989 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా 1,20,527మంది కరోనా వ్యాధితో మరణించారు.
 
ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 90.99శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసులలో 1.50 శాతానికి మరణాల రేటు తగ్గింది. దేశంలో మొత్తం నమోదైన కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 7.51 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,75,760 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు దేశంలో 10,65,63,440 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments