Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రిసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ప్రమాదకర పరిస్థితులు... ఆందోళనలో స్థానికులు

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (13:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ కేసుల భయంతో తిరుపతి, శ్రీకాళహస్తి వంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. 
 
ముఖ్యంగా తిరుపతి విషయానికి వస్తే నగరంలో 12, రూరల్‌ మండలంలో 2 చొప్పున 14 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ తిరుపతి నగరంలో 146, రూరల్‌లో 37 చొప్పున మొత్తం 183 కేసులు వెలుగు చూశాయి. 
 
అలాగే, శ్రీకాళహస్తిలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 130కి చేరుకుంది. తిరుపతి, శ్రీకాళహస్తిలలో నమోదైన కేసులు ఆయా పట్టణాల స్థాయి దృష్ట్యా రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా అత్యధికంగానే పరిగణించాలి. 
 
తాజాగా, జిల్లాలో 32 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తిరుపతిలో 12, రూరల్‌లో 2, పుత్తూరులో 6, చిత్తూరు, నగరిలో నాలుగు చొప్పున, రేణిగుంట, శ్రీకాళహస్తిలలో రెండు చొప్పున కేసులున్నాయి. 
 
పుత్తూరులో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలతో పాటు వారి 17, 15 ఏళ్ల కుమారులిద్దరికీ వైరస్‌ సోకింది. శ్రీకాళహస్తిలో ఇద్దరు రిమాండు ఖైదీలకు పాజిటివ్‌ తేలింది. దీంతో జైలుకు పంపాల్సిన వారిని తిరుపతి కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments