ఏపీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు, ఒక్క రోజే 44 మంది మృతి

Webdunia
బుధవారం, 15 జులై 2020 (17:39 IST)
ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 2,412 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో22,197 శాంపిల్స్‌ను పరిశీలించగా 2, 412 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు.
 
మరోవైపు 805 మంది చికిత్సతో కోలుకొని డిశ్చార్జ్ య్యారు. ఇదిలావుండగా కోవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో 44 మంది మృతి చెందారు. కోవిడ్-19 కారణంగా అధిక మరణాలు సంభవించడం ఏపీలోఇదే తొలిసారి. అనంతపురం జిల్లాలో 9 మంది, పశ్చిమ గోదావరి 9, కర్నూలు 5, చిత్తూరు 4, తూర్పు గోదావరి 4, విశాఖపట్నం 4, కడప 2, కృష్ణా 2ప్రకాశం 2, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోఒక్కొక్కరు కరోనా కారణంగా చనిపోయినట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ తెలిపింది.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 32,575. ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 452. వివిధ ఆస్పత్రిలలో చికిత్స నిమిత్తం కోలుకొని ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 16,032కు చేరింది. ప్రస్తుతం వివిధ కోవిడ్ ఆస్పత్రిలలో 16,091 మంది చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments