నిండు గర్భిణి...ప్రాణాలు ఫణంగా పెట్టి దేశీయ కరోనా నిర్ధారణ కిట్

Webdunia
ఆదివారం, 29 మార్చి 2020 (13:47 IST)
దేశంతో పాటు.. ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టుముట్టింది. ఈ వైరస్ మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు అనేక దేశాలు అహర్నిశలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే అనేక దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. అయితే, రోజురోజుకూ మరింతగా విస్తరిస్తున్న ఈ వైరస్‌కు విరుగుడు మందును ప్రపంచం ఇప్పటివరకు కనిపెట్టలేక పోయింది.
 
అదేసమయంలో కరోనా వైరస్ నిర్ధారణ కిట్‌లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత గురువారం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల కిట్‌ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఓ నిండు గర్భిణి తన ప్రాణాలను ఫణంగా పెట్టి తయారు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పుణెలోని మైల్యాబ్స్‌ డిస్కవరీ సొల్యూషన్స్‌ కంపెనీలో పరిశోధన, అభివృది విభాగం అధిపతిగా మీనల్ దఖావే భోసాలే అనే మహిళ పని చేస్తున్నారు. ఈమె నిండు గర్భిణి. అయినా, దేశానికి సేవ చేయడమే తొలి కర్తవ్యంగా భావించారు. ఫలితంగా నాలుగు నెలల్లో జరగాల్సిన కిట్‌ అభివృద్ధి ప్రక్రియను 6 వారాల్లో పూర్తిచేశారు. 
 
ఈ నెల 18న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ) పరిశీలన కోసం కిట్‌ను పంపారు. ఆ మరునాడే ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చారు. మిగతా అనుమతులన్నీ లభించడంతో మైల్యాబ్స్‌కు చెందిన కరోనా కిట్‌ గత గురువారమే(మార్చి 26న) మార్కెట్లోకి వచ్చింది. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

తర్వాతి కథనం
Show comments