Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌ విలయతాండవం.. 24 గంటల్లో 879 మంది మృతి

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (10:15 IST)
దేశంలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. కరోనా వైరస్‌ రెండో దశలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,61,736 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం కంటే స్వల్పంగా తక్కువ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 879 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,71,058కి చేరింది. మరణాల రేటు 1.26 శాతానికి చేరింది. 
 
దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,36,89,453కి చేరింది. కొత్తగా 97,168మంది వైరస్‌ బారి నుండి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,22,53,697కు చేరి.. రికవరీ రేటు 89.86శాతానికి తగ్గింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 12,64,698కి చేరింది.
 
కరోనా మహమ్మారి ప్రభావం ఛత్తీస్‌గఢ్‌లో మరింత దారుణంగా ఉంది. రాయ్ పూర్ లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి సహా, పలు పట్టణాల్లోని ఆసుపత్రులలో శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుంటున్నాయి. పలు మృతదేహాలను దాచే పరిస్థితులు లేక ఎండలో వాటిని ఉంచడాన్ని చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments