Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్.. మరణాల్లో చైనాను దాటేసిన ఇటలీ

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (14:32 IST)
కరోనా వైరస్ మహమ్మారి మరింతగా వ్యాపిస్తోంది. శుక్రవారానికి ఈ వైరస్ ఏకంగా 180 దేశాలకు విస్తరించింది. అలాగే, కరోనా వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా, ఇటలీలో ఈ సంఖ్య అత్యధికంగా ఉంది. కరోనా మృతుల్లో చైనాను ఇటలీదాటిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 10048గా నమోంది. ఇందులో ఒక్క ఇటలీలోనే ఏకంగా 3,433 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2.45 లక్షలకు చేరితే, ఒక్క ఇటలీలోనే 41 వేల మందికి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇటలీలో గడిచిన 24 గంటల్లో 427 మంది మృతి చెందారు. చైనాలో వరుసగా రెండో రోజూ కొత్తగా కరోనా కేసులు నమోదు కాకపోవడంతో చైనా పాలకులతో పాటు.. ఆరోగ్య శాఖ అధికారులు ఊపిరి  పీల్చుకున్నారు. 
 
ఇకపోతే, ఇరాన్‌లో 1,284, స్పెయిన్‌లో 831, ఫ్రాన్స్‌లో 372, అమెరికాలో 218, యూకేలో 144, దక్షిణ కొరియాలో 94, నెదర్లాండ్స్‌లో 76, జర్మనీలో 44, స్విట్జర్లాండ్‌లో 43 మంది మృతి చెందారు. అదేవిధంగా మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 195కు చేరుకోగా, మృతుల సంఖ్య ఐదుకు చేరింది. వీరంతా 60 యేళ్ళ పైబడినవారే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments