Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు నెలల తర్వాత 40 వేల దిగువకు పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 5 జులై 2021 (10:13 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. గత మూడు నెలల తర్వాత ఈ కేసుల నమోదులో గణనీయంగా తగ్గుదల కనిపించింది. ఆదివారం 43,071 కేసులు నమోదవగా, సోమవారం వెల్లడించిన వివరాల మేరకు 40 వేలకు దిగువన రికార్డయ్యాయి. ఇది ఆదివారం నాటి కంటే 7.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మార్చి 19 తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే మొదటిసారని పేర్కొన్నది.
 
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 39,796 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,85,229కి చేరింది. ఇందులో 2,97,00,430 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,02,728 మంది రోగులు మహమ్మారి వల్ల మరణించారు. 
 
మొత్తం కేసుల్లో 4,82,071 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 723 మంది కొత్తగా మృతిచెందారని, 42,352 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదేవిధంగా ఇప్పటివరకు 35,28,92,046 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని తెలిపింది.
 
దేశవ్యాప్తంగా జూలై 4 నాటికి మొత్తం 41,97,77,457 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 15,22,504 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments