Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాజిటివ్ కేసులు కాస్త తగ్గాయ్ గానీ.. మరణాలు పెరిగాయ్

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (11:13 IST)
దేశంలో కరోనా వైరస్ రెండో అల వ్యాప్తి మరింతగా విస్తరిస్తోంది. ఈ వైరస్ కట్టడికి రాష్ట్రాలన్నీ అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఫలితం మాత్రం అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా, కరోనా రెండో దశ వ్యాప్తి కట్టడికి పలు రాష్ట్రాలు లాక్డౌన్‌, నైట్‌కర్ఫ్యూతో పాటు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. 
 
ఇప్పటికే భారత్‌లో ప్రపంచ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత ఐదు రోజులుగా మూడు లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు, రెండువేలకుపైగా మరణాలు రికార్డవుతుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం రోజువారీ కేసులు కాస్త తగ్గినా.. వరుసగా ఆరో రోజు 3 లక్షల కేసులు నమోదవగా.. మరోసారి రెండువేలకుపైగా మరణాలు నమోదయ్యాయి.
 
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,23,144 పాజిటివ్‌ కేసులు, 2771 మరణాలు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా 2,51,857 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. 
 
కాగా, కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,76,36,307కు పెరిగింది. ఇప్పటి వరకు 1,45,56,209 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి మొత్తం 1,97,894 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 28,82,204 యాక్టివ్‌ కేసులున్నాయని చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments