Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో విజృంభణ.. అయినా రికవరీ రేటు రికార్డు

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (12:18 IST)
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తూనే వుంది. లాక్ డౌన్ సడలింపుతో రోజుకు లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే కొద్దిరోజులుగా తొంభై వేలకు దగ్గరలో నమోదవుతున్న కేసులు సోమవారం భారీగా తగ్గాయి. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 55 లక్షలు దాటింది. గడచిన 24 గంటలలో 75,083 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 1,053 మంది మృతి చెందారు.
 
అలానే గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 1,01,468గా ఉంది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 55, 62,664కు చేరగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా 9,75,861 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 44,97,868కు చేరింది. 
 
అలానే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 88,935 కు చేరింది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 80.12 శాతానికి చేరింది. ఇక కరోనా వైరస్ నుండి 1,01,468 మంది సోమవారం ఒక్క రోజే కోలుకోవడం సరికొత్త రికార్డ్. ఇకపోతే.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. 70లక్షల కేసులతో అగ్రరాజ్యం అమెరికా తొలి స్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments