24 గంటల్లో 30వేల కరోనా కేసులు.. 4 నెలల్లో మొదటిసారి..

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (14:38 IST)
దేశంలో కరోనావైరస్ విజృంభణకు అడ్డుకట్టపడకపోయినా.. కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించడం ఊరట కలిగించే అంశం. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 30,548 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 88,45,127గా ఉంది. అయితే, నిన్న ఒక్కరోజే భారీ తగ్గుదల కనిపించింది. జులై 13 తరవాత ఒకరోజులో ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
 
అలాగే, ఆదివారం నిర్ధారణ పరీక్షల సంఖ్య (8,61,706) తగ్గడం కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. 
 
ఇక, నిన్న ఈ మహమ్మారి కారణంగా 435 మంది ప్రాణాలు కోల్పోగా.. దేశవ్యాప్తంగా ఈ మరణాల సంఖ్య 1,30,070కి చేరుకుంది. 88లక్షల పైచిలుకు మంది వైరస్‌ బారిన పడినప్పటికీ, వారిలో 82,49,579 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. మరోవైపు, గత కొద్ది రోజులుగా క్రియాశీల కేసుల సంఖ్య ఐదు లక్షల లోపే ఉంటుంది. 
 
ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు 5.26 శాతానికి తగ్గగా, రికవరీ రేటు 93.27 శాతానికి పెరిగింది. ఇదిలా ఉండగా..రోజూవారీ సగటు కేసుల సంఖ్య ఐదు వారాలుగా క్రమంగా తగ్గుతున్నట్లు ఇటీవల మంత్రిత్వ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments