Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విలయతాండవం: బ్రెజిల్‌ను భారత్ దాటేస్తుందా?

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (09:39 IST)
భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా 24 గంటల్లో 37,148 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు 40 వేలకు పైగా కేసులొచ్చాయి. తాజా కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1155191కి పెరిగింది. గత 24గంటల్లో 587 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 28084కి చేరింది. 
 
ప్రస్తుతం భారత్‌లో మరణాల రేటు 2.4 శాతంగా ఉంది. అంటే ప్రతి 1000 మంది కరోనా సోకిన వారిలో... 24 మంది చనిపోతున్నారు. ఇక... గత 24 గంటల్లో 24491 మంది రికవరీ అయ్యారు. ఫలితంగా మొత్తం రికవరీల సంఖ్య 724577కి చేరింది. అందువల్ల ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 402529గా ఉంది. రికవరీ రేటు 62.7 శాతంగా ఉన్నా.... రోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుండటం విచారకరం. 
 
ప్రస్తుతం మొత్తం కేసుల్లో భారత్ టాప్-3లో ఉండగా... రోజువారీ కేసుల్లో టాప్-2లో ఉంది. మొత్తం మరణాల్లో భారత్ టాప్ 8లో ఉండగా... రోజువారీ మరణాల్లో బ్రెజిల్ తర్వాత భారత్ రెండో స్థానంలో వుంది. ఇదివరకు మొదటిస్థానంలో ఉన్న అమెరికా ఇప్పుడు మూడోస్థానానికి చేరింది. కానీ భారత్‌లో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది కాబట్టి... త్వరలోనే బ్రెజిల్‌ని దాటి టాప్‌లో నిలిచే ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments