Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా ఉగ్రరూపం - మరో 3561 కొత్త కేసులు

Webdunia
గురువారం, 7 మే 2020 (09:45 IST)
భారత్‌లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఫలితంగా గత 24 గంటల్లో మరో 3561 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52952కు చేరింది. 
 
అలాగే, గత 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. మొత్తం 89 మంది చనిపోగా, ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 1783కు చేరినట్టు కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఇకపోతే, గత 24 గంటల్లో దేశంలో 3,561 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం  52,952కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 15,266 మంది కోలుకోగా, ఒకరు విదేశాలకు వెళ్లిపోయారు. ఆసుపత్రుల్లో 35,902 మంది చికిత్స పొందుతున్నారు.
 
ఇదిలావుండగా, బుధవారం తెలంగాణాలో కొత్తగా 11 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. కొత్త కేసులతో కలిపితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,107కు చేరుకుంది. 
 
వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 430. ఈరోజు 20 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 648కి పెరిగింది. ఈ వివరాలను ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ప్రియాశెట్టి అవుట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments