దేశంలో విజృంభిస్తోన్న కరోనా.. 24 గంటల్లో 52,050 కేసులు.. 803 మంది మృతి

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (10:17 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 18 లక్షల 50 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 52,050 కేసులు నమోదు కాగా, 803 మంది ప్రాణాలు విడిచారు. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 44,306 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.
 
దేశంలో మొత్తం 18,55,745 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,86,298 ఉండగా, 12,30,509 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 38,938 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 66.31 శాతంగా ఉంది. 
 
ఇక మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 15,700 కొవిడ్‌ మరణాలు సంభవించాయి. నిత్యం అక్కడ 250కిపైగా కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. 
 
తమిళనాడు, ఢిల్లీలలో ఇప్పటివరకూ 4వేల చొప్పున కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లోనూ 2500చొప్పున కరోనా మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే.. ప్రపంచంలో కొవిడ్‌ కేసుల్లో భారత్‌ మూడోస్థానంలో ఉండగా, మరణాల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రికెటర్లు వెంట పడుతున్నారు.. వారితో డేటింగ్ చేయడం ఇష్టంలేదు : ఖుషీ ముఖర్జీ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Chiru: అనిల్ రావిపూడి దుర్గమ్మ సన్నిధిలో చిరంజీవి డబ్బింగ్ లో తాజా అప్ డేట్

Akhanda 2 Tickets reduced: తెలంగాణలో అఖండ 2 టికెట్ ధరలు తగ్గించబడ్డాయి

Siddhu Jonnalagadda: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సిద్ధు జొన్నలగడ్డ హ్యాట్రిక్ చిత్రం ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ట్రెండ్స్ రిపోర్ట్ 2025లో కీలక విషయాలు

పనిలో ఉన్నప్పుడు మైగ్రేన్: మనస్సును ప్రశాంతంగా, రోజును సజావుగా తీసుకెళ్లే మార్గాలు

శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి పిస్తా పప్పు

రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే?

గుండెకి చేటు చేసే చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments