వైరా గురుకులంలో కరోనా కలకలం : 27 మంది విద్యార్థులకు పాజిటివ్

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (15:07 IST)
తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని వైరాలో ఉన్న గురుకుల పాఠశాలలో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. ఏకంగా 27 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. ఇటీవల ఇంటికి వెళ్లివచ్చిన ఓ విద్యార్థి ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో అతనికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, పాజిటివ్ అని తేలింది. 
 
ఆ విద్యార్థి ద్వారా మిగిలిన విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. దీంతో కరోనా వైరస్ బారినపడిన విద్యార్థులందరినీ వారివారి ఇళ్లకు పంపించేశారు. అలాగే, ఈ విషయం తెలిసిని మిగిలిన విద్యార్థులకు కూడా తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళుతున్నారు. 
 
ఇదిలావుంటే, ఇటీవల నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని చెన్నారం గేట్ వద్ద ఉన్న గురుకుల బాలికల పాఠశాలలో పది మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. వీరిలో ఇద్దరు టీచర్లు కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాపై అవగాహన లేని వ్యక్తికి సినిమాటోగ్రఫీ శాఖనా? సీఎం విజయ్‌పై విశాల్ ఫైర్

రజనీకాంత్‌తో పోటీపడతాను.. అసూయ లేదు : కమల్ హాసన్

నడిరోడ్డుపై నటి పావలా శ్యామల - నిర్మాత దిల్ రాజు పెద్ద మనసు

పెద్ది చిత్రం మల్లయోధుడు కోడి బయోపిక్ కాదు : డైరెక్టర్ బుచ్చిబాబు

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

తర్వాతి కథనం
Show comments