Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యుడా వందనం... ఐదు రోజుల తర్వాత ఇంటికి.. అయినా ఆరుబయటే...

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (13:08 IST)
దేశాన్ని, ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ బారినపడిన వారిని కాపాడేందుకు వైద్యులు, నర్సులు తమ శక్తినంతటినీ ధారపోస్తూ, రేయింబవుళ్ళూ శ్రమిస్తున్నారు. అనేక మంది వైద్యులు ఇళ్ళకు పోవడంమానేశారు. తమ భార్యాపిల్లలను చూడటం మరచిపోయారు. కేవలం కరోనా రోగులకు వైద్య సేవలు అందించడంలోనే నిమగ్నమయ్యారు. 
 
అలాంటివారిలో డాక్టర్ సుధీర్ దేహారియా ఒకరు. ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజాధాని భోపాల్‌లోని ఓ ఆస్పత్రిలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. కరనా వైరస్ బారిన తమ ఆస్పత్రిలో చేరే వారికి వైద్యసేవలు అందిస్తున్నారు. అలా గత ఐదు రోజులుగా ఆయన విధుల్లోనే నిమగ్నమయ్యారు. 
 
ఐదు రోజుల తర్వాత అంటే మంగళవారం తన భార్యాపిల్లలను చూసేందుకు ఇంటికి వెళ్లారు. కానీ, ఇంట్లోకి వెళ్లలేదు. ఇంటి వాకిట్లోనే కూర్చొని తన కుటుంబ సభ్యులతో పాటు టీ తాగారు. ఈ దృశ్యం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. 
 
ఈ విషయం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి వెళ్లింది. అంతే.. డాక్టర్ సుధీర్ ఫోటోను సీఎం చౌహాన్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతలో షేర్ చేశారు. డాక్టర్ సుధీర్ దేహరియా ఐదు రోజుల తర్వాత ఇంటికి వచ్చి, ఇంటి బయటనే కూర్చుని టీ తాగారు. బయటి నుండే తిరిగి ఆసుపత్రికి వెళ్లారు. హ్యాట్సాఫ్ టు డాక్టర్ సుధీర్ అంటూ కితాబిచ్చారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

సరికొత్త స్క్రీన్ ప్లేతో వస్తున్న 28°C మూవీ మెస్మరైజ్ చేస్తుంది : డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments