Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండుగ ప్రయాణాలపై కరోనావైరస్ ఎఫెక్ట్, ఇంటి నుండి కదలడానికి ఇష్టపడని ప్రజలు

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (10:43 IST)
కరోనావైరస్ విజృంభణతో ఈసారి పండుగలకు ప్రయాణాలు అంతంతమాత్రమేనని ఓ సర్వే పేర్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి అత్యధిక శాతం మంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. అతి స్వల్పంగా మాత్రం ప్రయాణాలపై ఆసక్తి చూపుతున్నారు. లోకల్ సర్కిల్స్ అనే ఆన్లైన్ ప్లాట్‌పార్మ్ దేశంలోని 239 జిల్లాలో 25 వేల మంది వద్ద జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
 
రాబోయేది పండుగ సీజన్ కావడంతో ప్రయాణాల విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకునేందుకు ఈ సర్వేను నిర్వహించింది. కరోనా కారణంగా ఈసారి ప్రజలు ప్రయాణాలపై అంతగా మోజు చూపడం లేదు. 69 శాతం మంది ప్రజలు పండుగలకు తాము ఎక్కడికీ వెళ్లడం లేదని ఇంట్లోనే ఉంటున్నామని తెలపగా 19 శాతం మంది మాత్రమే ప్రయాణాలకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు.
 
ప్రయాణాలు చేయాలనుకున్నా వారిలో 23 శాతం మంది విమాన ప్రయాణానికి సిద్దపడగా 38 శాతం మంది కారు లేదంటే క్యాబ్‌లో వెళ్తామని చెప్పారు. 13 శాతం మంది కుటుంబ సభ్యులను, స్నేహితులను కలవడానికి ఇష్టపడగా 3 శాతం మంది విహార యాత్రకు వెళ్తామని చెప్పారు. మరో 3 శాతం మంది మాత్రం రెడింటకీ ప్రాధాన్యం ఇచ్చారు. 12 శాతం మంది మాత్రం ప్రయాణాలు పెట్టుకుంటామా, వద్దా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments