Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండుగ ప్రయాణాలపై కరోనావైరస్ ఎఫెక్ట్, ఇంటి నుండి కదలడానికి ఇష్టపడని ప్రజలు

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (10:43 IST)
కరోనావైరస్ విజృంభణతో ఈసారి పండుగలకు ప్రయాణాలు అంతంతమాత్రమేనని ఓ సర్వే పేర్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి అత్యధిక శాతం మంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. అతి స్వల్పంగా మాత్రం ప్రయాణాలపై ఆసక్తి చూపుతున్నారు. లోకల్ సర్కిల్స్ అనే ఆన్లైన్ ప్లాట్‌పార్మ్ దేశంలోని 239 జిల్లాలో 25 వేల మంది వద్ద జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
 
రాబోయేది పండుగ సీజన్ కావడంతో ప్రయాణాల విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకునేందుకు ఈ సర్వేను నిర్వహించింది. కరోనా కారణంగా ఈసారి ప్రజలు ప్రయాణాలపై అంతగా మోజు చూపడం లేదు. 69 శాతం మంది ప్రజలు పండుగలకు తాము ఎక్కడికీ వెళ్లడం లేదని ఇంట్లోనే ఉంటున్నామని తెలపగా 19 శాతం మంది మాత్రమే ప్రయాణాలకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు.
 
ప్రయాణాలు చేయాలనుకున్నా వారిలో 23 శాతం మంది విమాన ప్రయాణానికి సిద్దపడగా 38 శాతం మంది కారు లేదంటే క్యాబ్‌లో వెళ్తామని చెప్పారు. 13 శాతం మంది కుటుంబ సభ్యులను, స్నేహితులను కలవడానికి ఇష్టపడగా 3 శాతం మంది విహార యాత్రకు వెళ్తామని చెప్పారు. మరో 3 శాతం మంది మాత్రం రెడింటకీ ప్రాధాన్యం ఇచ్చారు. 12 శాతం మంది మాత్రం ప్రయాణాలు పెట్టుకుంటామా, వద్దా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments