ఆస్పత్రిలో వుండలేక.. కరోనా బాధితురాలు పారిపోయింది.. చివరికి..?

Webdunia
సోమవారం, 13 జులై 2020 (21:45 IST)
నల్గొండ జిల్లాలో కరోనా బాధితురాలు ఆస్పత్రి నుంచి పారిపోయింది. ఆస్పత్రిలో వుండలేక తన గ్రామానికి చేరుకుంది. చివరికి పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో 108 సాయంతో ఆమెను వైద్య సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ మండల యాద్గార్ గ్రామానికి చెందిన మహిళకు కరోనా సోకింది. నల్గొండ ప్రభుత్వాస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
 
కానీ సోమవారం డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్‌ల కళ్లుగప్పి పారిపోయింది. ఆస్పత్రి నుంచి నేరుగా తమ గ్రామానికి వెళ్లిపోయింది. ఆమెను చూసి షాక్ తిన్న గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు గ్రామానికి చేరుకున్నారు. ఆపై ఆమెను వైద్య సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. 
 
ఇకపోతే.. ఆదివారం రాత్రి వరకు తెలంగాణ ప్రభుత్వం 1,70,324 కరోనా వైరస్ టెస్టులు నిర్వహించింది. అందులో 1,35,653 ఫలితాలు నెగిటివ్ వచ్చాయి. 34,671 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 356 మంది కరోనా వల్ల మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments