70 మందికి కరోనా వేరియంట్: 10 లక్షల మందికి లాక్‌డౌన్ విధించిన ప్రభుత్వం, ఎక్కడ?

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (22:09 IST)
కరోనా సంక్షోభం మాస్కులు ధరించడం ఆపలేదు. మరోసారి, చైనాలోని ఒక నగరాన్ని పూర్తిగా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. సుమారు 4 మిలియన్ల మంది జనాభా ఉన్న ఈ నగరంలో కరోనా సూపర్-స్ప్రెడర్ వేరియంట్ కారణంగా మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లలో బంధించబడ్డారు. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 
మరోవైపు లాక్డౌన్ నిర్ణయించినట్లు చైనా ప్రభుత్వం ధృవీకరించింది. మూడు రోజుల్లో 70 మందికి పైగా కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉన్నప్పటికీ, కోవిడ్‌పై కఠిన చర్యలు తీసుకోవడంలో చైనా ఈసారి మరింత పగడ్బందిగా వున్నట్లు చెపుతున్నారు.

 
ప్రయాణాలపై పూర్తి ఆంక్షలు
చైనాలోని బైస్ నగరం వియత్నాం సరిహద్దు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. గత శుక్రవారం నాడు మొదటి కరోనా కేసు కనుగొనబడింది. కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుని తిరిగి వచ్చిన ఓ ప్రయాణికుడికి కరోనా సోకి అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో ముందుజాగ్రత్తగా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి లాక్‌డౌన్‌ ప్రకటించారు. వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. ఇంటింటికి కరోనా పరీక్షలు చేస్తున్నారు.

 
కరోనా మహమ్మారి నేపథ్యంలో చైనా తన దక్షిణ సరిహద్దులో భారీ భద్రతను మోహరించింది. సరిహద్దుల నుంచి ఎవరూ చొరబడకుండా, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments