Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కొత్తగా 117 పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 28 మే 2020 (22:17 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్టే తగ్గి.. ఇపుడు మళ్లీ విజృంభిస్తోంది. ఫలితంగా బుధవారం సెంచరీకిపైగా కొత్త కేసులు నమోదు కాగా, గురువారం కూడా మరో సెంచరీకి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1908కి చేరింది.
 
రాష్ట్రానికి వలస వచ్చిన వారిలో గురువారం కొత్తగా 117 కొత్త కేసులు నమోదయ్యాయి. స్థానికంగా 66 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో 51 మందికి కరోనా సోకినట్టు తేలింది. వారిలో సౌదీ అరేబియా నుంచి వచ్చిన 49 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇద్దరు వలస కార్మికులు కూడా కరోనా బారినపడ్డారు. 
 
దీంతో ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో మొత్తం 348 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ సోకి చికిత్స తీసుకుని మెరుగుపడి డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1345 మంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 67. ప్రస్తుతం ఆస్పత్రుల్లో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 844గా వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments