Corona: ఉద్ధృతి కొద్దిగా తగ్గినా 40వేల పైనే కొత్త కేసులు

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (10:53 IST)
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా నిత్యం 40 వేలపైనే కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 14,28,984 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..40,134 కొత్త కేసులు వెలుగుచూశాయి.

క్రితం రోజుతో పోల్చితే 4 శాతం మేర తగ్గాయి. కేరళలో కరోనా విజృంభిస్తోంది. అక్కడ మళ్లీ 20వేల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. ఇక నిన్న 422 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 3.16 కోట్లకు చేరగా.. 4.24 లక్షల మంది మహమ్మారికి బలయ్యారు.
 
ఇటీవల కాలంలో క్రియాశీల కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం 4,13,718 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.30 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.36 శాతానికి చేరింది. నిన్న 36,946 మంది కోలుకోగా.. ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.08 కోట్లుగా ఉంది. మరోవైపు నిన్న 17లక్షల మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 47.22కోట్ల డోసులు పంపిణీ అయినట్లు కేంద్రం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పెళ్లి చేసుకునే ముందు.. నా అమ్మకు తోడు వుండాలి.. సుప్రీత

Varalaxmi: ఈ ప్రపంచంలో ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని శరత్ కుమార్

Ram Charan: పెద్ది డబ్బింగ్ ప్రారంభించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Niharika Konidela: రాకాస తో నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం : నిహారిక కొణిదెల

సీఎం రేవంత్‌ను కలిసిన రష్మిక.. అల్లు వారింటికి విరోష్ దంపతులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments