తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్డేట్.. ఏపీలో సున్నా మరణాలు.. తెలంగాణలో..?

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (11:03 IST)
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో కొత్తగా 293 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో ఇవాళ 535 మంది కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసులు సంఖ్య 2,87,108కు చేరింది. వీరిలో 2,79, 991 మంది కోలుకున్నారు. మరో 5,571 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 
 
హోం ఐసోలేషన్‌లో 3,418 మంది ఉన్నారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఇవాళ్టివరకు 1,546 మంది మృత్యువాతపడ్డారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 26,590 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 69,51,297 మందికి పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
 
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీలో సున్నాకు కరోనా మరణాలు పడిపోయాయి. కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేయడం ప్రారంభించిన నాటి నుంచి మొదటి సారి సున్నా (0) కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు కూడా బాగా తగ్గుముఖం పట్టాయి. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58,519 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 326 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 8,82,612కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండియన్ సినిమా గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ లో "చెన్నై లవ్ స్టోరీ" ఒకటి కాబోతోంది - హీరో కిరణ్ అబ్బవరం

Hero Venkat: హీరో వెంకట్ మాస్ ఎంటర్ టైనర్ హరుడు

ఖైదీలకు 23 చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేస్తాం : సౌమ్య మిశ్రా

హనీ మేడమ్ సెల్ఫీ ప్లీజ్ అంటూ నటి నడుమును అసభ్యంగా తాకిన వ్యక్తి, వీడియో వైరల్

Salman Khan: సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబినేషన్ లో చిత్రం ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

రవీనా టాండన్, రాషా థడానీలతో తల్లి-కూతుళ్ల నమ్మకాన్ని వేడుక చేసిన గార్నియర్ కలర్ నాచురల్స్

మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?

పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?

తర్వాతి కథనం
Show comments