తెలంగాణాలో పెరుగుతున్న కేసులు - ముంబైలో 24 గంటల్లో ఎన్ని కేసులంటే?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (21:07 IST)
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గతవారం రోజులుగా ప్రతి రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్క రోజే 52 కేసులు నమోదు కాగా, తాజాగా గత 24 గంటల్లో మరో 37 కేసులు వెలుగుచూశాయి. 
 
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలోని మొత్తం బాధితుల సంఖ్య 681కి పెరిగినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం బాధితుల్లో 118 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 18 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ఆసుపత్రుల్లో ఇంకా 545 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. 
 
అలాగే, కరోనా వైరస్ మహమ్మారి ముంబైని భయపెడుతోంది. అత్యధిక మంది బాధితులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, అందులో సగం కేసులు రాజధాని ముంబైలోనే నమోదవుతుండటం అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. 
 
తాజాగా, గత 24 గంటల్లో కొత్తగా మరో 183 కేసులు నమోదయ్యాయి. అలాగే, నగరానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ముంబైలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1936కు పెరిగినట్టు బీఎంసీ తెలిపింది. ఇప్పటివరకు నగరంలో 113 మంది ప్రాణాలు కోల్పోగా, 181 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durgatej: వచ్చే ఏడాదిలో వివాహం ఉంటుందన్న సాయి దుర్గతేజ్

Varanasi: వారణాసి... ఐదు నిమిషాలు నెరేట్ చేశాక నా మైండ్ బ్లాక్ అయింది

Ram : ఆంధ్ర కింగ్ తాలూకా... ఒక రోజు ముందుగానే రిలీజ్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments