90 లక్షలు దాటిన కరోనా కేసులు, 24 గంటల్లో కొత్తగా 45,882 కేసులు, 584 మరణాలు

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (13:31 IST)
దేశంలో ఇటీవల కాలంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. ఇప్పుడు మళ్లీ ఆ సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 90 లక్షల మార్కును దాటేసింది. కేవలం 22 రోజుల్లోనే పది లక్షల కేసులు నమోదు కావడం గమనార్హం. కేసుల పరంగా అమెరికా తరవాత భారత్ రెండో స్థానంలో ఉంది.
 
తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన  24 గంటల్లో 45,882 కొత్త పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. అయితే, క్రియాశీల కేసులు ఐదు శాతానికి దిగువన ఉండటం ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,43,794గా ఉండగా.. ఆ కేసుల రేటు 4.93 శాతానికి తగ్గింది. అలాగే రికవరీల సంఖ్య 84,28,409 (93.60 శాతం)గా ఉంది. 
 
ఈ మహమ్మారి కారణంగా గడిచిన 24 గంటల్లో 584 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,32,162కి చేరింది. నిన్న ఒక్కరోజే 10,83,397 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. మరోవైపు దిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. మాస్క్‌ ధరించనివారికి రూ.2,000 జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం