Webdunia - Bharat's app for daily news and videos

Install App

#CoronavirusStrain యూకే నుంచి భారత్‌కు కరోనా 2.O.. ఢిల్లీ మీదుగా చెన్నైకి..!?

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (14:54 IST)
corona virus
యుకే నుండి ఢిల్లీ మీదుగా చెన్నైకి తిరిగి వచ్చిన ఒక ప్రయాణీకుడుకి మంగళవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇది కరోనా వైరస్ కొత్త జాతా కాదా అనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. అతని నమూనాలను పూణేకి పంపించారు. ఇప్పటివరకు 14 మంది ప్రయాణికులను యుకె నుండి తిరిగి వచ్చిన వారిగా గుర్తించి వారిని పర్యవేక్షిస్తున్నారు. యుకె నుండి అన్ని విమానాలను భారత్ నిషేధించింది.
 
దేశంలో కొత్త వైరస్ అడుగుపెట్టినా సరే మన దేశం అప్రమత్తంగా ఉందని భారత వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. యుకె నుంచి వచ్చే విమానాలను మన దేశం సహా చాలా దేశాలు నిషేధించాయి. విమాన ప్రయాణ నిషేధం డిసెంబర్ 31 న రాత్రి 23:59 వరకు ఉంటుంది. అన్ని యుకె విమానాల సస్పెన్షన్ మంగళవారం రాత్రి నుండి ప్రారంభమవుతుంది. 
 
దీనికి కరోనా స్ట్రెయిన్‌గా పేరుపెట్టారు. దక్షిణాఫ్రికా సహా చాలా దేశాల్లో ఇది అడుగుపెట్టింది. ఇక అక్కడి ప్రజల్లో కూడా ఒకరకమైన భయం అనేది మొదలయింది. ఈ నేపథ్యంలో యుకెలో లాక్ డౌన్ విధించారు. అక్కడ నాలుగో లాక్ డౌన్‌ని అమలు చేస్తున్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం కొత్త వేరియంట్ 70 శాతం ఎక్కువ వేగంగా ఉందని పేర్కొన్నారు. అయితే ఇది ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్‌తో కట్టడి అవుతుందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments