Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాతో తప్పని తలనొప్పి.. చేపల్లో కూడా కరోనా వుందట..

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (09:36 IST)
చైనాతో ప్రపంచ దేశాలకు తలనొప్పి తప్పట్లేదు. ఇప్పటికే చికెన్ తింటే కరోనా వస్తుందని హెచ్చరించిన చైనా.. ప్రస్తుతం చేపల్లో కరోనా ఉందని చెబుతోంది. అందుకే చైనాకు వస్తున్న దిగుమతులను చైనా ఆపేసింది. ఇందులో ఇండియా నుంచి వెళ్లే దిగుమతులు చైనా ఆపేసింది. ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న చేపల్లో చైనా కరోనా వైరస్‌ను గుర్తించింది. 
 
భారత్‌లోను బసు ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి ఈ చేపలు చైనాకు ఎగుమతి అవుతున్నాయి. చైనా అక్కడ వీటిని పరీక్షించగా కరోనా వైరస్ ఉన్నట్లు తేలినట్లు ఆంగ్ల వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. దీంతో ఆ కంపెనీ దిగుమతులను చైనా నిలిపివేసిందని తెలుస్తోంది. గట్టకట్టిన కటిల్‌ఫిష్ ప్యాకేజీలో మూడు శాంపిల్స్‌లో వైరస్ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. అందుకే ఈ దిగుమతులపై వారం పాటు నిషేధం విధించినట్లు పత్రిక పేర్కొంది. 
 
అయితే చైనా ఇలా దిగుమతులను నిలిపివేయడం ఒక్క భారత కంపెనీలకు మాత్రమే కాకుండా ఇండోనేషియా, బ్రెజెల్, ఈక్వెడార్, రష్యా దేశాల నుంచి వస్తున్న ఆహార పదార్థాలను కూడా పరీక్షించింది. వీటిలో బ్రెజిల్‌, ఈక్వెడార్ దేశాల నుంచి వస్తున్న ఆహారపదార్థాల్లో కూడా వ్యాధికారక వైరస్ ఉన్నట్లు గుర్తించింది. అప్పుడు కూడా ఈ దేశాల నుంచి వస్తున్న దిగుమతులను ఆపేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments