Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాతో తప్పని తలనొప్పి.. చేపల్లో కూడా కరోనా వుందట..

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (09:36 IST)
చైనాతో ప్రపంచ దేశాలకు తలనొప్పి తప్పట్లేదు. ఇప్పటికే చికెన్ తింటే కరోనా వస్తుందని హెచ్చరించిన చైనా.. ప్రస్తుతం చేపల్లో కరోనా ఉందని చెబుతోంది. అందుకే చైనాకు వస్తున్న దిగుమతులను చైనా ఆపేసింది. ఇందులో ఇండియా నుంచి వెళ్లే దిగుమతులు చైనా ఆపేసింది. ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న చేపల్లో చైనా కరోనా వైరస్‌ను గుర్తించింది. 
 
భారత్‌లోను బసు ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి ఈ చేపలు చైనాకు ఎగుమతి అవుతున్నాయి. చైనా అక్కడ వీటిని పరీక్షించగా కరోనా వైరస్ ఉన్నట్లు తేలినట్లు ఆంగ్ల వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. దీంతో ఆ కంపెనీ దిగుమతులను చైనా నిలిపివేసిందని తెలుస్తోంది. గట్టకట్టిన కటిల్‌ఫిష్ ప్యాకేజీలో మూడు శాంపిల్స్‌లో వైరస్ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. అందుకే ఈ దిగుమతులపై వారం పాటు నిషేధం విధించినట్లు పత్రిక పేర్కొంది. 
 
అయితే చైనా ఇలా దిగుమతులను నిలిపివేయడం ఒక్క భారత కంపెనీలకు మాత్రమే కాకుండా ఇండోనేషియా, బ్రెజెల్, ఈక్వెడార్, రష్యా దేశాల నుంచి వస్తున్న ఆహార పదార్థాలను కూడా పరీక్షించింది. వీటిలో బ్రెజిల్‌, ఈక్వెడార్ దేశాల నుంచి వస్తున్న ఆహారపదార్థాల్లో కూడా వ్యాధికారక వైరస్ ఉన్నట్లు గుర్తించింది. అప్పుడు కూడా ఈ దేశాల నుంచి వస్తున్న దిగుమతులను ఆపేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments