Webdunia - Bharat's app for daily news and videos

Install App

శభాష్ సోనూసూద్, మహారాష్ట్ర గవర్నర్ ప్రశంసలు

Webdunia
శనివారం, 30 మే 2020 (21:08 IST)
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్‌తో వలస కార్మికులు తీవ్ర ఇక్కట్లు పాలయ్యారు. తినేందుకు తిండి లేక తాగేందుకు నీరు లేక నానా అగచాట్లు పడుతున్నారు. కనీసం వారివారి ఇళ్లకు వెళ్దామంటే ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో ఎక్కడివారు అక్కడే ఆకలితో అలమటిస్తున్నారు.
 
ఇలాంటివారిని పెద్దమనసు గల సెలబ్రిటీలు ఆదుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో జగపతి బాబు, చిరంజీవి తదితర హీరోలు తమవంతు సాయం చేస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే... నటుడు సోను సూద్ వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారివారి గమ్యస్థానాలకు చేర్చుతున్నారు.
 
ఈ సందర్భంగా ఆయన ఈరోజు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని ముంబైలోని రాజ్ భవన్‌లో కలిశారు. వలస వచ్చిన ప్రజలు తమ సొంత రాష్ట్రాలకు చేరుకోవడానికి, వారికి ఆహారాన్ని అందించడానికి తను చేస్తున్న సహాయ కార్యక్రమాల గురించి గవర్నర్‌కు వివరించారు. సోను సూద్ చేస్తున్న సహాయకార్యక్రమాలపై గవర్నర్ ప్రశంసలు కురిపించారు. సోనూసూద్ చేస్తున్న ప్రయత్నాలకు తమ పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments