Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ కొత్త వేరియంట్ స్ట్రైయిన్‌పై భారత్ అప్రమత్తం

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (10:51 IST)
కరోనా వైరస్ కొత్త వేరియంట్ స్ట్రైయిన్‌పై భారత్ అప్రమత్తమైంది. యూకేలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ కొత్తరకం వైరస్‌కు సంబంధించి చర్చించేందుకు సోమవారం ఉదయం ఆరోగ్యమంత్రిత్వశాఖ అత్యవసర భేటీ ఏర్పాటు చేసింది. కోవిడ్‌-19 ఉమ్మడి పర్యవేక్షణ బృందాన్ని భేటీకి కేంద్రం పిలిచింది. స్ట్రెయిన్‌ ఆవిర్భావం సహా పలు కీలక అంశాలపై కేంద్రం చర్చించనుంది. 
 
ఈ సమావేశానికి డబ్ల్యూహెచ్‌ఓలోని భారత ప్రతినిధి రోడరికో హెచ్‌ ఓఫ్రిన్‌ హాజరు కానున్నారు. బ్రిటన్‌ సహా ఆఫిక్రాదేశాల్లో కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే ఆదివారం లండన్‌లో ప్రభుత్వం ఆదివారం లాక్‌డౌన్‌ విధించింది. స్ట్రెయిన్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు. 
 
ఈ క్రమంలో ఇప్పటికే యూరోపియన్‌ దేశాలు బిట్రన్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. బెల్జియం, నెదర్లాండ్‌, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, ఐర్లాండ్, బల్గేరియా, కెనడా ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అయితే యూకే నుంచి విమానాల నిషేధంపై భారత్‌ ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తామని ఓ అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments