Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కొత్తగా మరో 69,921 కరోనావైరస్ పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (11:16 IST)
భారత్‌లో గడిచిన 24 గంటల్లో 69,921 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 819 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 65,081 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
 
దేశంలో మొత్తం 36,91,173 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,85,996 ఉండగా 28,39,882 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా 65,288 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76.94శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసులలో 1.77 శాతానికి మరణాల రేటు తగ్గింది.
 
దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 21.29 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,16,920 కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు దేశంలో 4,33,24,834 కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments